Monday, January 26, 2026

నూతన సర్పంచులు గ్రామాభివృద్ధి లో కీలక పాత్ర పోషించాలి:ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు గుడిపాటి కోటయ్య యాదవ్


ప్రజాశక్తి,మిర్యాలగూడ జనవరి 11:
ఆదివారం స్థానిక యాదవ సంఘం భవనం లో మిర్యాలగూడ పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు గుడిపాటి కోటయ్య యాదవ్ ల  అధ్యక్షతన  నియోజకవర్గ వ్యాప్తంగా గెలుపొందిన యాదవ సర్పంచుల కు ఉపసర్పంచ్ లకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.అఖిల భారత యాదవ సంఘం జంగా లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన కాలమానినీ  ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి బట్టు రమాదేవి వెంకట్ యాదవ్,సర్నాల వెంకన్న యాదవులు మాట్లాడుతూ కాలమానినీ యాదవుల ఐక్యత కోసం పనిచేస్తుందని ఇంతమంది యాదవులను ఒకే దగ్గర సేకరించి కాలమానినీ  రూపొందించడం అభినందనీయమని  అన్నారు.గెలుపొందిన సర్పంచులు వారి గ్రామాలలో అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ కీలకపాత్ర పోషించాలని, అలా పోషించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని  అన్నారు. గెలుపొందిన సర్పంచులు జక్కుల రమణ ఎల్లయ్య యాదవ్, కునుకుంట్ల అంజయ్య, గుండెబోయిన వెంకన్న, రాయనబోయిన పుల్లయ్య, చిలకల మురళి, ఉపసర్పంచ్లు చిలుకల సతీష్, గుండెబోయిన మల్లయ్య, గోవిందు చిట్టెమ్మ, చిర్ర మల్లేష్ లను  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పిన్ని పోయిన శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నాయకులు జడ రాములు, కంచుగట్ల లింగయ్య, కన్నెబోయిన వెంకటేశ్వర్లు, గుడిపాటి మట్టయ్య యాదవ్, డిబిఆర్ యాదవ్ , కట్టెబోయిన లక్ష్మణ్ యాదవ్, యాదవ  ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అర్వ అశోక్, చిర్ర మల్లయ్య కలికినబోయిన కోటయ్య, గంగుల బిక్షం, బచ్చనబోయిన మహేష్, బొమ్మనబోయిన శ్రీనివాస్, చెవుల రాము, వెంకట్ రాములు,చిమట శ్రీను, పుట్టపాక శ్రీనివాస్, పెద్ద బోయిన వెంకటేశ్వర్లు చిలుకల అబ్బులు, గుడిపాటి రవి, పొన్నబోయిన మధు, పగిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!