Monday, January 26, 2026

సైబర్ నేరాల పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

వాట్సాప్ లలో వచ్చే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దు.. సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దు

ప్రజాశక్తి,నల్లగొండ నవంబర్ 6:
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రోజు దేశ వ్యాప్తంగా అనేక మంది సైబర్ నేరగాళ్లు బారిన పడి మోసాలకు గురవుతున్నారనీ,వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్గి ఉండమే ఉత్తమ మార్గం అని జిల్లా ఎస్పీ అన్నారు.సైబర్ జాగారుకత దివాస్ సందర్భంగా నల్లగొండ పట్టణం కేంద్రంలోని దీప్తి నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు, సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా గారు ముఖ్యఅతిథిగా పాల్గొని  మాట్లాడుతూ..ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువగా సులభంగా మోసపోయేది సైబర్ నేరగాళ్ల ద్వారానే అని అన్నారు.కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.డబ్బుల పోయాక బాధపడటం కంటే అవగాహనా తో వ్యవహరించి జాగ్రత్తగా ఉండాలని అన్నారు.చదువుకున్న  విద్యార్దులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉంటే తన చుట్టూ పరిసరాల్లో ఉన్న ప్రజలకు,వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తద్వారా సైబర్ మోసాలు నిరోధించవచ్చునని ,సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని కళాశాల విద్యార్థినులకు తెలియజేశారు. ప్రస్తుత కాలం లో జరుగుతున్న  నేరాలు అయిన  ఏపీకే ఫైల్స్ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తున్నారు,ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ కు గురి అయి డబ్బులు పోయే అవకాశం ఉంటుంది, అలాగే జంప్డ్ డిపాజిట్ స్కీం, డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ప్రౌడ్, సైబర్ బుల్లింగ్ గురించి విద్యార్థులకు  అవగాహన కల్పించారు.అలాగే బ్యాంక్ అదికారులు ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడగరు అనే విషయాలను గుర్తించాలని,బ్యాంక్ వారు ఏలాంటి మెసేజ్ లు గాని, లింక్స్ పంపరని ఇట్టి విషయాలు గమనించి మీ కుటుంబ సభ్యులకు తెలియజేయాలని,ఏమైన సందేహాలు ఉంటే బ్యాంక్ కు వెళ్లి నిర్ధారించుకోవాలి అని అన్నారు.గ్రూప్ లలో లేదా వ్యక్తిగత నెంబర్ లకు అపరిచిత వ్యక్తుల నుండి ఎస్ ఎమ్ ఎస్ ఈ మెయిల్స్ ద్వారా గాని, వాట్సాప్ ట్యీట్టర్ ద్వారా వచ్చే బ్లూ కలర్ లింక్స్ ను క్లిక్ చేసి మోసపోవద్దని, అలా వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దనీ తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైన  వెంటనే స్పందించి 1930 కి సమాచారం అందించి ఎన్సీఆర్పి  పోర్టల్ (www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు. తద్వారా పోయిన డబ్బులు రికవరీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమoలో సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఎస్బీ సీఐ రాము, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐ విష్ణు,కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!