
కార్మికుల బీమా గోడపత్రికను ఆవిష్కరించిన- కలెక్టర్
ప్రజాశక్తి,నల్లగొండ నవంబర్ 24:
స్థానిక సంస్థల ఎన్నికలను మండల ప్రత్యేక అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ( 70) మంది నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి నిర్దేశించిన సమయంలోగా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తాను ర్యాండంగా తనిఖీ చేస్తానన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులకు మినహాయింపు ఉండదని, ఒకవేళ అత్యవసరమైతే ముందుగానే అనుమతి తీసుకోవాలని చెప్పారు.మండలాల ప్రత్యేక అధికారులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యేకంగా తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలని, అవసరమైతే ఎంపీడీవో కార్యాలయంలో కూర్చొని ఎన్నికలు సవ్యంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.అలాగే స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్,ఆర్డీవోలు,స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.సోమవారం మొత్తం (70) ఫిర్యాదులు రాగా,జిల్లా అధికారులకు (39) రెవెన్యూ శాఖకి( 31 )వచ్చాయి.స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, ఆర్డీవోలు వై.అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్మికుల బీమా పెంపు పై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు.జిల్లా కార్మిక శాఖ అధికారి ,తదితరులు ఉన్నారు.


Recent Comments